గుంటూరు నగరంలో ఓ జువెలర్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొనగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.