VSP: పంచగ్రామల భూ సమస్యపై శనివారం సింహాచలం జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నేత టీ.వీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వం హామీలు ఇచ్చినా సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికలలోపు సమస్య పరిష్కరించకపోతే 17 వార్డుల్లో గుణపాఠం చెబుతామన్నారు