KDP: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో పార్లమెంటు సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు తనూజ రాణి, వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.