KDP: సిద్ధవటం(మం) మాధవరం-1లోని జగనన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు గురువారం గ్రామ సచివాలయ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో రోజువారీ అవసరాలు కూడా నెరవేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.