NLR: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై సమీక్షించారు.