KDP: బ్రహ్మంగారి మఠంలో వెలసిన వీరబ్రహ్మేంద్ర స్వామివారికి భక్తులు సమర్పించే తల నీలాలు వసూలు చేసుకునే హక్కుకు ఈ నెల 9వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి బుధవారం తెలిపారు. వేలం పాటలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పని వేళల్లో తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.