PLD: గంజాయిని వ్యాపారంగా మార్చుకుని మాజీ సీఎం YS జగన్ రూ.వేల కోట్లు వెనకేశారని గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శుక్రవారం పిడుగురాళ్లలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,474 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.