ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థులకు రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.