KKD: విజయవాడ రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తునికి చెందిన దేవవరపు చండీ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఇతను విజయవాడలో ఇప్పటి వరకు 3 చోరీలు చేశాడని వెల్లడించారు. నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే సీఐ తెలిపారు. అతని నుంచి రూ.4,73,000ల చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.