ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్, పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కేసు దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఆమె సూచించారు. పెట్రోలింగ్, డయల్ 100కు వేగంగా స్పందించాలని, అసాంఘిక కార్య కలాపాలపై నిఘా పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలన్నారు.