ATP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రంట్ ఆఫీసు కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంటు పోస్టుల రాత పరీక్షలను రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.