NLG: దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రి వద్ద ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.