E.G: రాజమండ్రి రూరల్ మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి గ్రామపంచాయతీల పన్నుల్లో 60 శాతం వసూళ్లు సాధించినట్లు ఎంపీడీవో సునీల్ తెలిపారు. రూ.30.80 కోట్లలకు గాను, రూ.18.50 కోట్లు వసూలయ్యాయని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన వసూళ్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. తొర్రేడు గ్రామంలో 100 శాతం పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.