NGKL: బాలల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో బాలల పరిరక్షణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్మన్ సర్పంచ్ జంబుల శ్రీవాణి హనుమంత్ మాట్లాడుతూ.. బాలల హక్కులు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధి ప్రమీల, పంచాయతీ కార్యదర్శి భానుచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.