Kejriwal's sensational allegations against BJP
Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలనే కాదు తనను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, బీజేపీలో చేరితే వేధింపులు ఆపేస్తామని, కేసులు మాఫీ చేస్తామని హీతబోద చేస్తున్నారని ఎద్దేవచేశారు. ఇన్ని రోజలు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోందని, రూ.25 కోట్లు ఆశచూపుతూ బీజేపీ కండువ కప్పుకోవాలని పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందని, సభ్యులను బెదిరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ ఢిల్లీ ఛీప్ వీరేంద్ర సచ్ దేవా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం బీజేపీపై పలు ఆరోపణలు చేశారు.
చదవండి:Monkey fever: కర్ణాటకలో డేంజర్ బెల్స్.. మంకీ ఫీవర్తో ఇద్దరు మృతి
బీజేపీ తీర్థం పుచ్చుకుంటే చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయంటూ ఎద్దేవా చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరకి భయపడేది లేదని చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. స్కూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడమే మేము చేసిన తప్పులా అని అన్నారు. ఇప్పటి వరకు వారిపై పెట్టిన కేసులన్ని తప్పుడు కేసులేనని కేజ్రీవాల్ ఆరోపించారు.
చదవండి:Mukesh Ambani: టాప్ సీఈఓగా ముకేశ్ అంబానీ
#WATCH | On laying the foundation stone of new school buildings in Kirari, Rohini, Delhi Chief Minister Arvind Kejriwal says, "… They ask us to join BJP saying they'll spare us. I said I would not join the BJP… We are doing nothing wrong." pic.twitter.com/9Tfggh4P5M
— ANI (@ANI) February 4, 2024

