HYD: నాచారం, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై PCB అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు పలు కంపెనీలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని యూనిట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్నింటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, జరిమానాలు విధించారు.