CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 2న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వ్రతం కొనసాగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు టికెట్టు రూ. 300 గా నిర్ణయించామన్నారు.