అన్నమయ్య: మదనపల్లెలో చిన్నారి హత్య ఘటనపై స్పందించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.