SDPT: హుస్నాబాద్ బస్టాండ్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం బస్టాండ్ కంట్రోలర్ లకావత్ హరికి వినతి పత్రం సమర్పించారు. బస్టాండ్లో ఇటీవలి కాలంలో దొంగతనాలు తరచూ జరుగుతున్నాయన్నారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు.