MNCL: నెన్నెల మండలం గుడిపెల్లి శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెన్నెల నుంచి శ్రీరాంపూర్ వెళ్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో అనసూర్య, మల్లీశ్వరి, ఓదెలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రదీప్, అజయ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.