కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి అందిన 102 ఫిర్యాదులపై ఎస్పీ వారితో నేరుగా సంభాషించారు. ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దేశిత సమయంలోగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.