MHBD: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీగా వన్నం రామారావు (బయ్యారం మండలానికి చెందినవారు) ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరావు చేతుల మీదుగా ఆయన నియామకపత్రం అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.