కోనసీమ: విద్యుత్తు లైన్లకు సమీపంలోని చెట్ల కొమ్మలు, కొబ్బరి ఆకులు తొలగించడం కోసం యానాం లోని మెట్టకూరు విద్యుత్తు సబ్ స్టేషన్ పరిసర కాలనీలు, యూకేవీ నగర్, భీంనగర్, కన కాలపేట, అగ్రహారం, ఫ్రాన్సుతిప్ప, విష్ణాలయంవీధి పరిసరాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ముగ్గళ్ల వీరవెంకట సత్యనారాయణ తెలిపారు.