KNR: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శంకరపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వీణవంక మండలం చల్లూరుకి చెందిన శివరాత్రి మల్లేశ్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.