SRPT: సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ మద్దిరాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అన్నారు.