జగిత్యాల రూరల్ మండలం అంతర్గం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం మహిపాల్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విద్యా అభివృద్ధి, క్రమశిక్షణ పెంపు, పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వారు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.