»Kishan Reddy Gave Clarity On Alliance With Janasen
Kishanreddy : జనసేన బీజేపీ దోస్తీ కటీఫ్.. ఎన్నికల్లో పోటీ ఉండదన్న కిషన్ రెడ్డి
జనసేనతో బీజేపీ దోస్తీకి తెరపడినట్లే కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం లేదన్నారు.
Kishanreddy : జనసేనతో బీజేపీ దోస్తీకి తెరపడినట్లే కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం లేదన్నారు. గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందన్నారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. అంతకంటే ముందే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేఎల్పీ నేత ఎంపిక ఎప్పుడైనా జరగవచ్చు. సిట్టింగ్ ఎంపీలకు సీట్ల హామీపై చర్చ జరగలేదన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీలు వేస్తున్నామన్నారు. వారితో సమావేశం ఉంటుందని చెప్పారు.
మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపామని చెప్పారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికీ లాభం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో నాయకుడు ఎవరో తెలియదు ? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులను కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. భవిష్యత్తులో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నామన్నారు. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని, ప్రస్తుతం జనసేన ఎన్డీయే భాగస్వామిగా ఉందన్నారు.