KRNL: కౌతాళం మండల కేంద్రంలో ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ చెన్న బసప్ప ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పార్టీ చరిత్ర, ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్రను వివరించారు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు టీడీపీ ప్రత్యేకతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.