NDL: బండి ఆత్మకూరు మండలం కడమలకాలువలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అనీల్ అనే వ్యక్తి రాత్రి మద్యం మత్తులో తన భార్య ఎస్తేరుతో గొడవపతుండగా.. అడ్డు వచ్చిందని అత్త పసుపుల కళావతిని కత్తితో పొడిచాడని స్థానికులు తెలిపారు. క్షతగాత్రురాలిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి కళావతి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.