ADB: తాంసి మండల కేంద్రంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత శనివారం పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచ్ రతన్ భార్య అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గండ్రత్ సుజాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె వెంట మండల కాంగ్రెస్ నాయకులు కౌడల సంతోష్, కార్యకర్తలు, తదితరులున్నారు.