MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.