MBNR: సీసీ కుంట మండలం బండర్పల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి శనివారం ప్రారంభించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.