AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవాల సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ కోరింది.