NRPT: నారాయణపేట పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని శనివారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించారు. సిబ్బందికి భోజనం నాణ్యమైనది ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లలు, వృద్ధులతో సమస్యలు తెలుసుకుని అనంతరం పండ్లు పంపిణీ చేశారు.