KRNL: జిల్లా పోలీస్ శాఖ శనివారం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించింది. 196 మంది పోలీసులు 350 మంది వ్యక్తులు, 77 వాహనాలు, 50 అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకోగా, మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేశారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వారు తెలిపారు.