MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘Arrive Alive’ కార్యక్రమాన్ని మెదక్లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో, బస్సు, లారీ డ్రైవర్లు, పోలీస్ సిబ్బందికి కంటి పరీక్ష నిర్వహించారు.