AP: అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నేరవేర్చిందని తెలిపారు. అసెంబ్లీకి గైర్హాజరుతో వైసీపీ కుట్ర బయటపడిందన్నారు. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. 11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాని వైసీపీకి రాజకీయపార్టీగా ఉండే అర్హత లేదని పేర్కొన్నారు.