TG: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్ 2’ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సినిమాపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా సమాజంలో విభజనను పెంచుతోందని మండిపడ్డారు. ఈ చిత్రంలోని సంభాషణలు కేవలం హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బక్వాస్ సినిమా అని అన్నారు.