GNTR: వ్యసనాలకు అలవాటు పడి వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరినీ నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5.95 లక్షల విలువైన ఒక ఆటోతో పాటు 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో శనివారం వెస్ట్ సబ్ డివిజన్ ఇంఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.