VSP: విశాఖ పెదవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో టీ.రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న తొలేళ్ల ఉత్సవం, 31న అనుపు, ఏప్రిల్ 7న మారువారం, 11న అన్నదానం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవానికి సుమారు 70 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా.