TPT: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రెండు సంస్థలు కలిపి రూ.20 లక్షలకు పైగా విరాళం అందించాయి. చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,01,116 విరాళంగా అందించగా, బెంగళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళం సమర్పించింది.