అల్లూరి: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత విద్య కోటా కింద లాటరీ పద్ధతిలో 39 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు శనివారం తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఏప్రిల్ 7వ తేదీ లోగా చేరాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.