SDPT: ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో యువత క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ వ్యసనంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.