ATP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. మార్చి 29న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. పాత జెండా దిమ్మెలను శుభ్రం చేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు.