వనపర్తి మండలం రాజనగరంలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం తాత మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నక్క రాకేష్ (20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతపై ఉన్న మమకారంతో యువకుడు తనువు చాలించడం గ్రామంలో విషాదం నింపింది.