అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో రూరల్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, రికార్డులు లేని వాహనాలపై శుక్రవారం కేసులు నమోదు చేశారు. ఎస్సై నాగేశ్వరావు తెలిపిన మేరకు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రికార్డులు లేని 6 వాహనాలపై కేసులు నమోదు చేశారు.