SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గణపతి హోమం, అష్ట దివ్య కలశాభిషేకం, రాత్రి 7 గంటలకు మహా పడిపూజ నిర్వహిస్తామని చెప్పారు.