HYD: ప్రైవేటు ట్యాంకర్లు జలమండలి లోగోను వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి పేరు, లోగో, బ్రాండ్ను ఉపయోగిస్తూ ప్రైవేట్ బోర్ వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. జలమండలి లోగో ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నమని, దీనిని అనుమతి లేకుండా వినియోగించవద్దన్నారు.