SKLM: రణస్థలం పంచాయితీ బండిపాలెం గ్రామంలో మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు శుక్రవారం ఇక్కడ కొత్త మంచినీటి బోర్ మోటరును ప్రారంభించారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.