ASR: దేవీపట్నం మండలం కొత్తవీధి సమీపంలో మరో దూడపై పులి దాడి చేసి చంపేసిందని స్థానికులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో గంటల వ్యవధిలోనే దాడికి గురైన దూడల సంఖ్య 4కి చేరింది. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, బంధించేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక బలగాలు చూస్తుండగానే అక్కడ నుంచి పరారయ్యిందని స్థానికులు చెబుతున్నారు.